Saturday, July 17, 2010

ఇంత ఆదరణ చూస్తే ఆశ్చర్యమేస్తోంది

కడప ఎం.పీ వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ఓదార్పు యాత్రకు అపూర్వ స్పందన లభిస్తోందని మంత్రి పిల్లి.సుభాష్ చంద్రబోసు అన్నారు.ఆయన ఓదార్పు యాత్ర లో మీడియా తో మాట్లాడుతూ జగన్ యాత్ర వల్ల కాంగ్రెస్ పార్టీ కి లాభమే కాని నష్టమేమి లేదన్నారు.నిజం చెప్పాలంటే పార్టీ కి అదనంగా పది ఓట్లు వస్తాయే కాని ఓట్లు పోవన్నారు.
మంత్రి సుభాష్ చంద్రబోసు మాట్లాడుతూ తాను రాజకీయాల్లోకి వచ్చినప్పటినుండి దివంగత నేత వై.ఎస్.ఆర్ విదేయుడనని చెప్పారు. ఆయన మరణ వార్త విని మృతి చెందిన వారి కుటుంబాలను పరామర్శిస్తున్న జగన్ ఓదార్పు యాత్ర లో పాల్గొనటం తన కనీస ధర్మమని అన్నారు. ఓదార్పు యాత్రకు తెల్లవారుజామున రెండు గంటలకు కూడా జనం నుంచి లభిస్తున్న విశేష స్పందన, ఆదరణ చూస్తుంటే ఆశ్చర్యమేస్తున్నదని ఆయన అన్నారు

No comments: