Saturday, July 17, 2010

యువనేత జగన్ కు రాజమండ్రి ఆత్మీయ స్వాగతం


యువనేత, కడప ఎంపీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఓదార్పు యాత్రకు రాజమండ్రి నగరం లో అడుగడుగునా ఘనస్వాగతం లభించింది. వేలాదిమంది అభిమానులు, కార్యకర్తలు ఈ యాత్రలో పాల్గొన్నారు. ఆయనతో కరచాలనం చేసేందుకు యువకులు పోటీలు పడ్డారు. తనపట్ల వెల్లువలా చూపుతున్న ప్రజాభిమానానికి యువనేత చలించిపోయారు. అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా తాడితోట ఏరియాలో వేలాదిమంది ఆయనకు స్వాగతం పల్కారు. అక్కడ వైఎస్సార్ బస్ షెల్టర్ ను ఆయన ప్రారంభించారు. క్వారీ మార్కెట్ వద్ద వైఎస్ విగ్రహావిష్కరణకు వచ్చిన జగన్ కు అభిమానులు,కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. వైఎస్ మరణంతో కలత చెంది మృతుడైన నరసింహమూర్తి కుటుంబానికి ఓదార్పునిచ్చే నిమిత్తం అన్నపూర్ణమ్మపేట జంక్షన్ కు చేరుకున్న జగన్ కు మహిళలు బొట్టు పెట్టి పూలు జల్లుతూ హారతులిచ్చి ఆప్యాయంగా స్వాగతించారు. నరసింహమూర్తి కుటుంబాన్ని జగన్  ఓదార్చారు. వారి కుటుంబానికి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. ఓదార్పు యాత్రకు తూర్పుగోదావరి జిల్లాలో అపరిమితమైన జనాదరణతో పాటు ఎమ్మెల్యేల మద్దతు కూడా పెద్దయెత్తున లభించింది. మొదట ఆరుగురు ఎమ్మెల్యేలు ఓదార్పు యాత్ర లో పాల్గొన్నారు.ఆ తరువాత మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోసుతో పాటు తొమ్మిది మంది ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.

No comments: