Thursday, November 11, 2010
కాంగ్రెస్ లో కుట్రపూరిత వాతావరణం
అంబటి ధ్వజం
చెవిరెడ్డి భాస్కరరెడ్డిని కాంగ్రెస్ పార్టీ నుంచి ఏకపక్షంగా సస్పెండ్ చేయడాన్ని మరో బహిష్కృత నేత, జగన్ వర్గంలోని ప్రముఖ నాయకుడు అంబటి రాంబాబు తప్పుపట్టారు. కాంగ్రెస్ పార్టీకి ఎనలేని సేవ చేసిన భాస్కరరెడ్డిపై ఈచర్య అత్యంత శోచనీయమని గుంటూరులో విలేకరులతో మాట్లాడుతూ అంబటి అన్నారు. రాష్ట్ర కాంగ్రెస్లో కుట్రపూరిత వాతావరణం నెలకొనివుందని ఆయన ఆరోపించారు. వైఎస్ రాజశేఖరరెడ్డికి అనుకూలంగా మాట్లాడిన వారిని, ఓదార్పుకు అనుకూలంగా కదులుతున్న నేతలను బయటకు గెంటేస్తున్నారన అంబటి ఆవేదన వ్యక్తం చేశారు. జగన్కు అండగా నిలబడుతున్న నాయకులపై చర్యలు తీసుకుంటున్న అధినాయకత్వం, మరి పార్టీకి నష్టం కలిగించేలా వ్యవహరిస్తున్న వారిని ఎందుకు ఉపేక్షిస్తోందని ఆయన ప్రశ్నించారు. పార్టీని అభాసుపాలు చేస్తున్నవారిని, భ్రష్టు పట్టిస్తున్న వారిని ప్రోత్సహిస్తున్నారని అధినాయకత్వం ఏకపక్ష పోకడలపై తీవ్రంగా ధ్వజమెత్తారు.
జగన్ ఓదార్పుకు మద్దతివ్వడమే పాపమా?
తుడా మాజీ చైర్మన్ చెవిరెడ్డి సస్పెన్షన్
కాంగ్రెస్ యువనేత, కడప ఎంపీ వైఎస్.జగన్మోహన్ రెడ్డి ఓదార్పు యాత్రకు మద్దతిచ్చినందుకు గాను ఆయన వర్గానికి చెందిన తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ (తుడా) మాజీ ఛైర్మన్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ వెలివేసింది. చెవిరెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్టు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ బుధవారం ప్రకటించింది. పీసీసీ క్రమశిక్షణా సంఘం ఈ చర్య తీసుకుంది. పార్టీ వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నందుకు ఎందుకు చర్యలు తీసుకోకూడదని ప్రశ్నిస్తూ గతంలోనే చెవిరెడ్డికి నోటీస్ జారీ చేసిన విషయం తెల్సిందే. ఆ నోటీస్కు చెవిరెడ్డి సమాధానం ఇచ్చారు. అయితే దీనికి సంతృప్తి చెందని పార్టీ పెద్దలు ఈ తీవ్రమైన చర్య తీసుకున్నారు. జగన్ వర్గానికి చెందిన అంబటి రాంబాబు, గట్టు రామచంద్రరావు, కొండా సురేఖ, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తదితరులకు ఇప్పటికే పార్టీ నుంచి ప్రతికూలత ఉంది. కొందర్ని దూరం పెడుతూ మరికొందర్ని సస్పెండ్ చేస్తూ అధిష్టానం మొత్తానికి జగన్ వర్గాన్ని ఒకేలా చూస్తున్న విషయం విదితమే.
నోకాజ్ నోటీస్ ఇచ్చారు: చెవిరెడ్డి
సస్పెన్షన్పై తనకెలాంటి బాధా లేదని చెప్పిన చెవిరెడ్డి ప్రజాదరణ లేని, ఎన్నికల్లో గెలవలేని వ్యక్తుల చేతుల్లో పార్టీ బందీగా మారుతోందని ఆవేదన చెందారు. తన సస్పెన్షన్కు సిఫార్సు చేసిన వారికి ప్రజల్లో పరపతే లేదన్నారు. తనకు నో కాజ్ నోటీస్ ఇచ్చారని దుయ్యబట్టారు.
కాంగ్రెస్ యువనేత, కడప ఎంపీ వైఎస్.జగన్మోహన్ రెడ్డి ఓదార్పు యాత్రకు మద్దతిచ్చినందుకు గాను ఆయన వర్గానికి చెందిన తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ (తుడా) మాజీ ఛైర్మన్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ వెలివేసింది. చెవిరెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్టు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ బుధవారం ప్రకటించింది. పీసీసీ క్రమశిక్షణా సంఘం ఈ చర్య తీసుకుంది. పార్టీ వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నందుకు ఎందుకు చర్యలు తీసుకోకూడదని ప్రశ్నిస్తూ గతంలోనే చెవిరెడ్డికి నోటీస్ జారీ చేసిన విషయం తెల్సిందే. ఆ నోటీస్కు చెవిరెడ్డి సమాధానం ఇచ్చారు. అయితే దీనికి సంతృప్తి చెందని పార్టీ పెద్దలు ఈ తీవ్రమైన చర్య తీసుకున్నారు. జగన్ వర్గానికి చెందిన అంబటి రాంబాబు, గట్టు రామచంద్రరావు, కొండా సురేఖ, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తదితరులకు ఇప్పటికే పార్టీ నుంచి ప్రతికూలత ఉంది. కొందర్ని దూరం పెడుతూ మరికొందర్ని సస్పెండ్ చేస్తూ అధిష్టానం మొత్తానికి జగన్ వర్గాన్ని ఒకేలా చూస్తున్న విషయం విదితమే.
నోకాజ్ నోటీస్ ఇచ్చారు: చెవిరెడ్డి
సస్పెన్షన్పై తనకెలాంటి బాధా లేదని చెప్పిన చెవిరెడ్డి ప్రజాదరణ లేని, ఎన్నికల్లో గెలవలేని వ్యక్తుల చేతుల్లో పార్టీ బందీగా మారుతోందని ఆవేదన చెందారు. తన సస్పెన్షన్కు సిఫార్సు చేసిన వారికి ప్రజల్లో పరపతే లేదన్నారు. తనకు నో కాజ్ నోటీస్ ఇచ్చారని దుయ్యబట్టారు.
Monday, November 8, 2010
జగన్ ఓదార్పుపై ప్రశంసల వర్షం
కడప పార్లమెంటు సభ్యుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సింహం కడుపున పుట్టిన మరో సింహం అని తెలుగు దేశం పార్టీ అసమ్మతి శాసనసభ్యుడు నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి అన్నారు. దివంగత రాజశేఖర్ రెడ్డి ఆంధ్ర రాష్ట్రానికి ఇచ్చిన కోహినూర్ వజ్రం జగన్ అని ఆయన అన్నారు. ఆంధ్ర రాష్ట్రానికి జగనే నిజమైన హీరో అని కూడా పొగిడారు. తండ్రి మరణానికి చలించి శ్వాస విడిచిన వారిని ఓదార్పు పేరుతో స్వయంగా వచ్చి కలుసుకోవడం ఆయన మంచితనానికి ప్రబల నిదర్శనమన్నారు. చివరి శ్వాస వరకు తాను జగన్ తోనే ఉంటానని నల్లపురెడ్డి ప్రతిన బూనారు.కమ్యూనిస్టు, భారతీయ జనతా పార్టీలు కలిసి కేంద్ర ప్రభుత్వాన్ని పడగొట్టాలని చూస్తే 2009లో కేంద్ర ప్రభుత్వాన్ని నిలబెట్టిన వ్యక్తి వైఎస్ రాజశేఖర్ రెడ్డి అని నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహనరెడ్డి అన్నారు. రాష్ట్రంలో, కాంగ్రెస్ లో వైఎస్ లేని కొరత ఇవాళ స్పష్టంగా కనిపిస్తోందని అన్నారు. వైఎస్ వారసుడిగా జగన్ ఈ రాష్ట్రాన్ని అన్ని విధాలుగా ముందుకు తీసుకు వెళతాడని పలువురు శ్లాఘించారు. నెల్లూరులో జగన్ వర్గం బలప్రదర్శనకు సిద్ధపడినట్లు అర్థమవుతోంది. ఈ సభకు పెద్ద యెత్తున ప్రజలు హాజరయ్యారు. జగన్ వర్గానికి చెందిన నాయకులంతా అక్కడ మోహరించారు. కొత్తగా లక్ష్మీపార్వతి, రోజా వచ్చి చేరారు. జగన్ తప్ప మరో నాయకుడు లేడంటూ రోజాతో సహా మిగతా నాయకులంతా ఎలుగెత్తి చాటారు.
కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ అభిమన్యుడు కాడని, పద్మవ్యూహాన్ని ఛేదించే అర్జునుడని ప్రముఖ సినీ నటి రోజా అభివర్ణించారు. జగన్ పద్మవ్యూహంలోకి వెళ్లిన అభిమన్యుడనీ పద్మవ్యూహంలోంచి బయటకు రాలేడని కొంత మంది అనుకుంటున్నారని, కానీ జగన్ దాన్ని ఛేదించే అర్జునుడని ఆమె అన్నారు. నెల్లూరు గాంధీ బొమ్మ సెంటర్ వద్ద ఆదివారం జరిగిన ఓదార్పు ముగింపు సభలో ఆమె ప్రసంగించారు. పాదయాత్ర తర్వాత వైయస్ రాజశేఖర రెడ్డి తిరుగులేని నాయకుడిగా ఎదిగినట్లు ఓదార్పు తర్వాత జగన్ తిరుగులేని నాయకుడిగా, ప్రజల మనిషిగా ఎదుగుతారని ఆమె అన్నారు. జగన్ ను చూసి ఓర్వలేక కొంత మంది విమర్శలు చేస్తున్నారని ఆమె అన్నారు. తండ్రి ఆస్తులకు వారసులుంటారు గానీ ఆశయాలకు వారసులుండరని, తండ్రి ఆశయాల సాధనను జగన్ వారసత్వంగా స్వీకరించడమే జగన్ విశిష్టతకు నిదర్శనమని ఆమె అన్నారు. వైయస్ ఆశయాల సాధనకు ముందుకు వచ్చిన వైయస్ జగన్ కు ప్రజలంతా సహకరించాలని ఆమె అన్నారు. మీ కుటుంబంలో తానొకడిని అని చెప్పడానికే జగన్ ఓదార్పు యాత్ర చేపట్టారని ఆమె చెప్పారు. ఈ యాత్ర చరిత్రలో నిల్చిపోతుందని, ఇది రాష్ట్రానికి, కాంగ్రెస్ పార్టీకి మంచిదని చెప్పారు.
సింహగిరి సీమ నుంచి జగన్ సింహనాదం
నెల్లూరులో ఆదివారం ఓదార్పు యాత్ర ముగింపు సభ జరిగింది. ఈ సభ కోసం కడప ఎంపీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన సర్వశక్తులూ సమీకరించారని తెలుస్తోంది. రెండు మాసాలకు పైగా దాదాపు 63 రోజుల పాటు ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో ఓదార్పు యాత్ర నిర్వహించిన జగన్ ఆ సమయంలో అధిష్టానంపై గానీ పార్టీలోని ప్రత్యర్ధి నాయకులపై గానీ విమర్శలేమీ చేయలేదు. ఆయన ప్రసంగాలు రొటీన్ గానే సాగుతున్నట్లు అనిపించింది. దీంతో మీడియా కూడా కొంత ఉదాసీనంగా వ్యవహరించింది. అయితే తన వర్గంపై అధిష్టానం, కొందరు వైఎస్ వ్యతిరేక పక్ష నేతలు చేస్తున్న రాజకీయ దాడి నేపధ్యంలో జగన్ నెల్లూరు సీమ నుంచి పదునైన వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు. పార్టీ అధిష్టానానికి హెచ్చరిక చేస్తూ తన అంతరంగాన్ని స్పష్టం చేశారు. వైయస్ జగన్ ఈ సభలో మామూలుగా కాక కాస్త కటువుగా మాట్లాడారు. ప్రతిపక్షాలను, వ్యతిరేక మీడియాను వదిలేసి సొంత పార్టీపైనే నిప్పులు చెరిగారు. తనను ఒంటరి చేయడానికి పార్టీలో కుట్ర జరుగుతుందని ఆయన ఆరోపించారు. పార్టీ అధిష్టానం తనను అంగీకరించే స్థితిలో లేదని తెలిసిన యువనేత తనను కాదంటే ఎదురయ్యే పరిస్థితి ఏమిటో పరోక్షంగా అధిష్టానానికి చెప్పదలిచారని, అందుకే అలా మాట్లాడారని భావిస్తున్నారు. అధిష్టానాన్ని ధిక్కరించి ఓదార్పు యాత్ర చేపట్టిన వైయస్ జగన్ ప్రతి అంశంలోనూ ఆయన చాలా స్పష్టంగా ఉన్నారని అంటున్నారు.
Subscribe to:
Posts (Atom)





