ఎన్నికల సంఘం సాక్షి టివీఛానల్ లో ప్రసారమైన, పత్రికలో ప్రచురితమైన తొమ్మిది ఆర్టికిల్స్ ను పెయిడ్ ఆర్టికిల్స్ గా పరిగణించామని ఎన్నికల ముఖ్య అధికారి బన్వర్ లాల్ చెప్పడం విశేషంగా ఉంది. వీటిలో పెయిడ్ ఆర్టికిల్ అంటే నిర్వచనమేమిటో తెలియదుకాని ఇది కొంత ఆసక్తిగానే ఉంది. జిల్లా స్థాయిలో ఉండే ఒక సమన్వయ కమిటీ వీటిని గుర్తించి సిఇఓకి తెలియచేసింది. ఇవి కనుక పెయిడ్ ఆర్టికిల్ప్ అని తేలితే ఆ ఖర్చును అభ్యర్ధి ఖాతాలో జమ చేస్తారు.ఇక్కడ విషయం ఏమిటంటే సాక్షి ఛానల్ కాని, పత్రిక కాని రెండూ వై.ఎస్.జగన్మోహన్ రెడ్డివే.అలాంటప్పుడు ఆయనకు అనుకూలంగా వేసే వార్తలే అనండి, ఆర్టికిల్సే అనండి వాటికి డబ్బు ఎవరిచ్చారని చెబుతారు. జగన్ తన పత్రికలో తానే
డబ్బిచ్చి అది కూడా అనధికారికంగా వేసుకుంటారా.? ఇందులో లాజిక్ అర్ధం కావడం లేదు. మరి ఇతర ఛానళ్లలో ఆయా పార్టీలకు అనుకూలంగా అనేక వార్తలు వస్తున్నాయి. అవన్ని పెయిడ్ న్యూస్ కిందకు రావా? దానిని ఎవరూ గుర్తించలేదా? అలాగే ఇంకో విషయం జగన్ మీడియాలో కాంగ్రెస్,తెలుగుదేశం వ్యతిరేక ప్రచారం జోరుగా సాగుతుంటే, జగన్ ప్రత్యర్ధి మీడియాలో జగన్ కు వ్యతిరేకంగా విపరీతంగా ప్రచారం జరుగుతోది. కేవలం పాజిటివ్ వార్తలనే పెయిడ్ న్యూస్ గా పరిగణిస్తారా? లేక నెగిటివ్ వార్తలను కూడా తీసుకుంటారా అన్నది తేలాలి. కాగా టిడిపి బృందం ఇప్పటికే సాక్షిపై ఎన్నికల సంఘం వరకు వెళ్లి ఫిర్యాదు చేసి వచ్చింది. అందులో జరిగే జగన్ ప్రచారం అంతటిని జగన్ ఖాతాలో వేయాలని కోరింది. అదే ప్రకారం మిగిలినవాటిలో జరిగే ప్రచారాన్ని కూడా తీసుకోవాలి కదా.నిజానికి జగన్ కు సాక్షి లో ప్రచారం జరగడం లేదని ఎవరూ అనరు.కాని పెయిడ్ న్యూస్ గా ఎలా నిర్ధారించారన్నదే అర్దం కాకుండా ఉంది. లేదా ఫలానా వార్తలను ప్రసారం చేస్తే పెయిడ్ న్యూస్ అవుతాయని ఎన్నికల సంఘం ఎక్కడైనా చెప్పిందా? ఇందులో కాస్త స్పష్టత కొరవడినట్లుగా ఉంది.
కర్టెసీ : కొమ్మినేని శ్రీనివాసరావు
డబ్బిచ్చి అది కూడా అనధికారికంగా వేసుకుంటారా.? ఇందులో లాజిక్ అర్ధం కావడం లేదు. మరి ఇతర ఛానళ్లలో ఆయా పార్టీలకు అనుకూలంగా అనేక వార్తలు వస్తున్నాయి. అవన్ని పెయిడ్ న్యూస్ కిందకు రావా? దానిని ఎవరూ గుర్తించలేదా? అలాగే ఇంకో విషయం జగన్ మీడియాలో కాంగ్రెస్,తెలుగుదేశం వ్యతిరేక ప్రచారం జోరుగా సాగుతుంటే, జగన్ ప్రత్యర్ధి మీడియాలో జగన్ కు వ్యతిరేకంగా విపరీతంగా ప్రచారం జరుగుతోది. కేవలం పాజిటివ్ వార్తలనే పెయిడ్ న్యూస్ గా పరిగణిస్తారా? లేక నెగిటివ్ వార్తలను కూడా తీసుకుంటారా అన్నది తేలాలి. కాగా టిడిపి బృందం ఇప్పటికే సాక్షిపై ఎన్నికల సంఘం వరకు వెళ్లి ఫిర్యాదు చేసి వచ్చింది. అందులో జరిగే జగన్ ప్రచారం అంతటిని జగన్ ఖాతాలో వేయాలని కోరింది. అదే ప్రకారం మిగిలినవాటిలో జరిగే ప్రచారాన్ని కూడా తీసుకోవాలి కదా.నిజానికి జగన్ కు సాక్షి లో ప్రచారం జరగడం లేదని ఎవరూ అనరు.కాని పెయిడ్ న్యూస్ గా ఎలా నిర్ధారించారన్నదే అర్దం కాకుండా ఉంది. లేదా ఫలానా వార్తలను ప్రసారం చేస్తే పెయిడ్ న్యూస్ అవుతాయని ఎన్నికల సంఘం ఎక్కడైనా చెప్పిందా? ఇందులో కాస్త స్పష్టత కొరవడినట్లుగా ఉంది.
కర్టెసీ : కొమ్మినేని శ్రీనివాసరావు









