Saturday, July 10, 2010

పదవినైనా వదిలేస్తా...ఓదార్పులో పాల్గొంటా!! స్పష్టం చేసిన మంత్రి బోస్


ఓదార్పు యాత్రలో తాను ఎట్టి పరిస్థితుల్లోనూ పాల్గొంటానని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ స్పష్టం చేశారు. ఇందుకు అడ్డొస్తే తన మంత్రిపదవికి సైతం రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు ఆయన ప్రకటించారు. ఈనెల 11వ తేదీ నుంచి తూర్పు గోదావరి జిల్లాలో వైఎస్.జగన్ ఓదార్పు యాత్ర ప్రారంభంకానుంది. జగన్ ఓదార్పు యాత్రలో పాల్గొనకుండా మంత్రులను, ఎమ్మెల్యేలను అడ్డుకునేందుకు కొంతమంది తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని బోస్ ఆరోపించారు. తన సొంత జిల్లాలో జరిగే యాత్రలో పాల్గొనేందుకు తాను సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించారు. "నేను జగన్ ఓదార్పు యాత్రలో పాల్గొంటాను. అవసరమైతే మంత్రి పదవికి రాజీనామా చేసేందుకైనా సిద్ధమే"
అని ఆయన ప్రకటించడం గమనార్హం.

No comments: