Saturday, July 24, 2010

అంబటి సస్పెన్షన్ బాధాకరం

పీసీసీ ప్రధాన కార్యదర్శి అంబటి రాంబాబు సస్పెన్షన్ చాలా చాలా బాధాకరమని యువనేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. ఈ పరిణామం తనకెంతో కలత కలిగించిందని జగన్ అన్నారు. రాజమండ్రిలోని హుకుంపేటలో ఆదివారం ఉదయం ఏడోరోజు ఓదార్పు యాత్రకు బయలుదేరేముందు ఆయన మీడియాతో మాట్లాడారు. అంబటి గొప్ప నాయకుడని, పార్టీకి ఎంతో సేవ చేశారని చెప్పారు. నాన్న రాజశేఖరరెడ్డితో పాటుగా దాదాపు 1500కిలోమీటర్లు పాదయాత్ర చేసిన అంబటి రాంబాబు పార్టీ రెండుసార్లు గెలవడం వెనుక కీలక పాత్ర పోషించారని తెలిపారు. అంబటి సస్పెన్షన్ పై అధిష్టానంతో మీరు మాట్లాడతారా అని విలేఖరులు ప్రశ్నించగా, తప్పకుండా తనవంతు పాత్ర పోషిస్తానని, తన ప్రయత్నం తాను చేస్తానని చెప్పారు. మీ వెనుక తిరిగేవారికి ఇది ఎటువంటి సిగ్నల్ ఇస్తుందని మీడియా ప్రశ్నిస్తే జగన్ ఆవేదన, ఆత్మవిశ్వాసాలతో స్పందించారు. తన వెనుక ఉన్నవారికి దేవుడున్నాడని, నాన్న ఆశీస్సులున్నాయని, వైఎస్ ను అభిమానించేవారి గుండెచప్పుడు తోడుందని పేర్కొన్నారు. అంబటిపై సస్పెన్షన్ చర్యను మీకు వార్నింగ్ గా భావించవచ్చా... అంటే, వార్నింగ్ తప్పు చేసేవారికి ఇస్తారు, నేనేమి తప్పు చేశానని ప్రశ్నించారు.

No comments: