Monday, December 27, 2010

ప్రధాని అప్పాయింట్ మెంట్ కోరిన యువనేత జగన్

రెండురోజుల నిరాహార దీక్షకు రాష్ట్రంమొత్తాన్ని కదిలించి సంచలనం సృష్టించిన యువనేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆ తర్వాత కూడా తన పోరు ఆపదల్చుకోలేదు. కొత్త పార్టీ స్థాపించిన తర్వాత రైతు ఎజెండానే ప్రధానంగా ఉంటుందని, తాను కూడా తండ్రి వైఎస్సార్ లాగే రైతు బాంధవుడ్నని ఆయన చాటుతున్నారు. తాజాగా జగన్ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ అప్పాయింట్ మెంటు కోరారు. బహుశా 28,29 తేదీల్లో ఆయన డిల్లీ వెళ్ళి ప్రధానిని కలుస్తారు. అప్పటికి ఆయనకు అప్పాయింట్ మెంట్ కూడా వస్తుదని అంటున్నారు. మాజీ ఎంపీ హోదాలో జగన్ ప్రధానిని కలుస్తున్నారు. కాగా రైతు సమస్యలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడాన్ని జగన్ ప్రధాని దృష్టికి తీసుకువెళతారని అంటున్నారు. కేంద్రం చొరవ చూపి బాధిత రైతాంగాన్ని ఆదుకోవాలని ఆయన కోరనున్నారు. కాగా రైతు సమస్యలపై తన వ్యవహార శైలితో ఇప్పటికే ఇంటా బయటా విమర్శలు ఎదుర్కొంటున్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి జగన్ ఢిల్లీ యాత్ర, ప్రధానితో భేటీ తలనొప్పి తెస్తాయనడంలో సందేహం లేదని పరిశీలకులు భావిస్తున్నారు.

No comments: